Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిశ దోషి చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ, వాడు చేసిన వెధవ పని అంటూ..

Advertiesment
Ramgopal Varma
, సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:22 IST)
దిశ హత్యాచార ఘటన తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దోషుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. 
అయితే ఈ ఘటనపై ఇటీవలే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానంటూ ప్రకటన చేశారు.
 
అయితే తాజాగా ఆయన ఇవాళ దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశారు. 
ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు వర్మ. దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశానన్నారు. చెన్నకేశవులుని 16 ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని, ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్‌ చేశారు.
 
అతడు దిశతో పాటు, రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
వాడు చేసిన వెధవ పనికి, ఇప్పుడు భార్యతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందని తన ట్విటర్లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్ర సృష్టించిన టీమిండియా.. కేఎల్ రాహుల్ కెప్టెన్ అయిన వేళ..