Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భర్తను చంపేశారుగా నాకు ఇల్లు రూ.15 లక్షలివ్వండి: చెన్నకేశవుల భార్య

Advertiesment
Disha Case
, బుధవారం, 18 డిశెంబరు 2019 (14:18 IST)
దేశవ్యాప్తంగా దిశ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్య తరువాత నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. దీనితో కొంతమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. అయితే నిందితుల ఎన్ కౌంటర్ పైన వారి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పోలీసుల తీరుపై మండిపడ్డారు. చట్టాలున్నాయి... ఆ చట్టాలు చూసుకుంటాయి కానీ ఇలా అతి దారుణంగా చంపేయడం ఏమిటని ప్రశ్నించారు నిందితుల కుటుంబ సభ్యులు. ఇదంతా జరుగుతుండగా మానవ హక్కుల కమిషన్ రావడం ఈ వ్యవహారంపై ఆరా తీయడం కూడా జరిగిపోయాయి. 
 
అయితే తాజాగా దిశ నిందితుల్లో ఒకరైన చెన్నకేశవుల భార్య రేణుక చెప్పిన మాటలు చర్చకు దారితీసింది. రేణుక ఇప్పుడు గర్భిణి. నా భర్తను చంపేశారు. సరే.. నాకు ఇప్పుడు దిక్కెవరు. నాకు 15 లక్షల రూపాయల డబ్బులు, డబుల్ బెడ్ రూం ఫ్లాం ఇవ్వండి.. నేను బతకాలి కదా అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణా ప్రభుత్వాన్ని రేణుక నిలదీస్తోంది. బతుకుతెరువు భారమవుతున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటోంది రేణుక.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాపాక విమర్శిస్తున్నారా? సర్లే భరిద్దాం అంటున్న పవన్?