Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బీబోయ్' కండోమ్‌లను విరుష్క జంట వాడి అనుభవం చెప్పాలి : రాఖీ సావంత్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోమారు నోరుపారేసుకున్నారు. ఈమె ప్రస్తుతం ‘బీబోయ్’ అనే కండోమ్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

Advertiesment
'బీబోయ్' కండోమ్‌లను విరుష్క జంట వాడి అనుభవం చెప్పాలి : రాఖీ సావంత్
, బుధవారం, 27 డిశెంబరు 2017 (11:12 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోమారు నోరుపారేసుకున్నారు. ఈమె ప్రస్తుతం ‘బీబోయ్’ అనే కండోమ్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో వీటి విక్రయాలను పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులోభాగంగా, బీబోయ్ కండోమ్‌ల తొలి వినియోగదారులు కోహ్లీ - అనుష్క జంట కావాలని, ఈ జంట ఈ కండోమ్‌లను వాడి అవి ఎలా ఉన్నాయో చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఈ నూతన దంపతులకు ఆమె సలహా ఇచ్చింది.
 
నిజానికి రాఖీ సావంత్ నటించిన ఈ కండోమ్ ప్రకటనలపై ఇటీవల వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ కండోమ్‌లకు సంబంధించిన యాడ్‌ను పగటిపూట ప్రసారం చేయవద్దని, రాత్రి 10 గంటల తర్వాతే ప్రసారం చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కండోమ్ ప్రకటనలు అసభ్యంగా ఉంటుండడంతో వీటి ప్రకటనలు నిలిపివేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కోర్టు కండోమ్ ప్రకటనల ప్రసారంపై ఆంక్షలు విధించింది.
 
తాజాగా 'బీబోయ్' కండోమ్ బ్రాండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్ మాట్లాడుతూ.. స్వదేశీ బ్రాండ్‌తో వస్తున్న రాందేవ్ బాబాకు దమ్ముంటే పతంజలి బ్రాండ్ కండోమ్‌లు తయారుచేసి చూపించాలని సవాలు విసిరిసింది. ప్రజలు పతంజలి కండోమ్లను చూడాలనుకుంటున్నారని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యన్ భాషలో 'బాహుబలి' .. దుమ్ముదులిపిన ట్రైలర్స్ (వీడియో)