Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో సిద్ధార్థ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?

prakash raj
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:12 IST)
హీరో సిద్దార్థ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను నటించిన కొత్త చిత్రం 'చిత్త'. శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో సిద్ధార్థ్ గురువారం బెంగుళూరు నగరంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీన్ని కొన్ని కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. తమ కావేరీ ఉద్యమానికి మద్దతు తెలుపాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో విలేకరుల సమావేశం నిర్వహించకుండా సిద్ధార్థ్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. చేతులు జోడించి, థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి సిద్ధార్థ్ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 
 
ఈ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. హీరో సిద్ధార్థ్‌కు సారీ చెప్పారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో సమస్య పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని కుంటి ఎంపీలను ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్యులు, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పని, అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెపుతున్నట్టు తన ఎక్స్ ఖాతాలో ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ 'సలార్' సినిమా వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 22న రిలీజ్