Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాధేశ్యామ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రభాస్ సోదరి ఎంట్రీ

Advertiesment
Prabhas
, శనివారం, 11 జులై 2020 (15:24 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటికే చాలామంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. కొందరు హీరోలుగా, మరికొందరు దర్శక నిర్మాతలుగా కొనసాగుతున్నారు. అందులో భాగంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి మరొకరు అడుగుపెడుతున్నారు. వారు ఎవరోకాదు.. కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ నిర్మాణంలో ఆమె పాలుపంచుకుంటూ.. ఈ సినిమాకు నిర్మాతగా అడుగు పెట్టనున్నారు.
 
రాధేశ్యామ్ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమోద్‌తో పాటు ప్రసీద కూడా ఉన్నారు. సినిమాతో పాటు ఓటీటీ ప్లాట్పార్మ్సకు సినిమాలను, వెబ్ సీరీస్‌లను నిర్మించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఆమె అన్నయ్య, హీరో ప్రభాస్‌కు పూర్తి సహకారం అందిస్తున్నా రట.
 
ఇప్పటికే కృష్ణంరాజు నటవారసుడిగా సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్పెక్ట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ బాహుబలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ మూవీ ఫేమ్ కె.రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నారు.
 
తాజాగా నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తుంది. యువి బ్యానర్‌తో కలిసి గోపి కృష్ణ బ్యానర్ పైన కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. భారీ బట్జెట్టుతో తయారయ్యే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవర్ స్టార్ నుంచి పవరొమాంటిక్ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్