Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్!

ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్!
, బుధవారం, 4 నవంబరు 2020 (16:40 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రాధేశ్వామ్". పూజా హెగ్డే హీరోయిన్. కరోనా వైరస్ కారణంగా స్వదేశంలో జరపాల్సిన షూటింగ్‌ను ఇటలీలో ప్లాన్ చేశారు. ఈ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తిచేసుకుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
 
అక్కడ కరోనా వైరస్‌ రెండో దశ మొదలైనప్పటికీ చిత్ర యూనిట్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ పూర్తి చేసుకొంది. అక్కడ కీలక సన్నివేశాలతోపాటు పాటల్ని తెరకెక్కించారు. సోమవారం 'రాధేశ్యామ్‌' బృందం హైదరాబాద్‌కి చేరుకుంది.
webdunia
 
త్వరలో తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలుకానుంది. దీని కోసం అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్లు వేస్తున్నారని సమాచారం. మరో 20 రోజులు చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుందన్నది టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటిస్తున్న పూజా హెగ్డే ఇటలీ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి 'టీమ్‌ అందరి సహకారంతో ఇటలీ షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తయింది. త్వరలో హైదరాబాద్‌లో కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చపోలీ ఆనకట్ట వద్ద అశ్లీల వీడియో షూట్... పూనమ్‌పై కేసు!