Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు

Advertiesment
naga sushila
, సోమవారం, 18 సెప్టెంబరు 2023 (16:59 IST)
హీరో అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీలపై హైదరాబాద్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీలతో పాటు మరికొందరు కలిసి దాడి చేశారంటూ చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నాగసుశీలతో పాటు శ్రీనివాస్‌లు సంయుక్తంగా పలు చిత్రాలు నిర్మించడంతో వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారిమధ్య భూవివాదం కూడా ఉంది. 
 
ఈ క్రమంలో శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్టనర్ చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే, తనకు తెలియకుండానే శ్రీనివాస్ తన భూములను విక్రయించాడని గతంలో పోలీసులకు నాగసుశీల ఫిర్యాదు చేశారు.
 
మరోవైపు, తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి తనపై నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల తనయుడు సుశాంత్‌తో నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామన్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగసుశీలపై శ్రీనివాస్ తాజాగా ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో యానిమల్ న్యూ పోస్టర్‌ విడుదల