Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ''పద్మావత్‌'' .. రూ.300 మార్కుకు దగ్గరలో?

''పద్మావత్'' సినిమాను వివాదాలు వెంటాడాయి. ఈ చిత్రానికి వచ్చినన్ని వివాదాలు మరే సినిమాకు రాలేదనే చెప్పాలి. ఎప్పుడే చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ రాజు రావల్ రతన్ సింగ్‌ను చంపేస్తే.. ఆయన భార్య ఆ

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ''పద్మావత్‌'' .. రూ.300 మార్కుకు దగ్గరలో?
, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (11:10 IST)
''పద్మావత్'' సినిమాను వివాదాలు వెంటాడాయి. ఈ చిత్రానికి వచ్చినన్ని వివాదాలు మరే సినిమాకు రాలేదనే చెప్పాలి. ఎప్పుడే చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ రాజు రావల్ రతన్ సింగ్‌ను చంపేస్తే.. ఆయన భార్య ఆత్మాహుతి చేసుకుందని చదువుకుని ఉంటాం. అదే కథ, కథనంతో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''పద్మావత్''.
 
ఈ సినిమా వివాదాల నడుమ విడుదలై కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. ఫిబ్రవరి 25న విడుదలైన పద్మావత్ రూ.300 కోట్ల మార్కుకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. రణ్‌‌వీర్ సింగ్, దీపికా పదుకునే, షాహిద్ కపూర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపిస్తోందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. 
 
ఈ సినిమా రిలీజైన తొలివారంలోనే రూ.166.50 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా.. అదే దూకుడుతో రెండో వారంలో రూ.129 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్కు వద్ద పయనిస్తోంది. ఇప్పటిదాకా రూ.265 కోట్లు పద్మావతి కలెక్షన్లు సాధించిందని తరణ్ ఆదర్శ్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలు