Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అషూ రెడ్డిది ప్లాస్టిక్ సర్జరీ ఫేసా? అనుష్క డైలాగ్‌పై ట్రోల్స్ (video)

Ashu Reddy
, శనివారం, 28 మే 2022 (15:43 IST)
అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా బిగ్ బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. అంతేగాకుండా మరింత పాపులారిటీ పెంచేసుకుంది. తర్వాత బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగుపెట్టింది.
 
ఇక ఫినాలె దగ్గరపడుతున్న సమయంలో అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అప్పటి నుంచి హాట్ హాట్ ఫోటోలకు పోజులిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
 
ఆమె బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ అజయ్‌‌తో కలిసి మిర్చి సినిమాలోని ఓ డైలాగ్ పై రీల్ చేసింది. "కాలం మారిపోయి పద్ధతులు మారాయి కానీ నాకు కనుక స్వయంవరం పెడితే ఎంత మంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవారో తెలుసా?" అనే అనుష్క డైలాగ్ చెబుతుంది.
 
ఈ డైలాగ్ విన్న అజయ్ ఆమె తలపై ఒక్కటిస్తాడు. ఈ వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేసిన అషూ మనసులోని మాటను కామెంట్ చేయండి అని క్యాప్షన్ ఇచ్చింది.
 
ఇక నెటిజన్లు రెచ్చిపోయి మరీ ఆమెను ట్రోల్ చేశారు. వారి మనసులోని మాటలను బయటపెడుతూ రకరకాలుగగా కామెంట్లు పెట్టారు. "నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్ కి అంత సీన్ లేదులే" అంటూ నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాటరాని మౌనమిది చిత్రం నుంచి లిరికల్ సాంగ్