Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతార వ్యాక్సిన్ వివాదం.. నర్సు చేతిలో సిరంజి ఎక్కడ..?

Advertiesment
Nayanthara
, గురువారం, 20 మే 2021 (11:27 IST)
Nayanatara
లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తన ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ప్రియుడి విఘ్నేష్ శివన్‌‌తో కలిసి చెన్నైలో కోవిడ్‌పై పోరాడే వ్యాక్సిన్ తీసుకోవడం మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయింది. ఇటీవల ఆమె వ్యాక్సిన్ తీసుకొన్నట్టు ఫోటోలను షేర్ చేసింది.
 
అయితే ఫోటోలు ఇప్పుడు నయనతారను వివాదం లోకి నెట్టాయి. నయనతార వాక్సిన్ తీసుకొన్నట్టు షేర్ చేసిన ఫోటోలో నర్సు చేతిలో సిరంజీ లేకపోవడంపై నయనతార అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 
 
ఫోటోకు ఫోజివ్వడానికే ఆమె అలా వ్యవహరించిందా అనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతున్నాయి. నయనతార వ్యాక్సిన్ తీసుకొన్నట్టు క్లియర్‌గా నర్సు చేతిలో సిరంజీ ఉన్న ఫోటోను షేర్ చేసి వివాదానికి తెర దించే ప్రయత్నం చేశారు.
 
ఇకపోతే.. నయనతార ప్రస్తుతం రజనీకాంత్‌, కీర్తి సురేష్, కుష్బూతో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే సమంత, విజయ్ సేతుపతితో కలిసి మరో చిత్రంలోనూ నయన నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భీమ్ బంగారం, పోరాటంలో ధైర్యవంతుడు రాజ‌మౌళి