Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోయిన్ కాదు.. 'సైనా'ను ఢీకొట్టే పాత్ర...

మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ

హీరోయిన్ కాదు.. 'సైనా'ను ఢీకొట్టే పాత్ర...
, ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (14:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసుకోవడంతో, కథానాయికగానే అనుకున్నారు. 
 
కానీ ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందనీ, 'నరసింహా రెడ్డి'ని ఢీకొట్టే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. విలక్షణమైన పాత్ర కనుకనే నయనతార అయితే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నది అమితాబ్ కూతురు పాత్ర కోసమని అంటున్నారు. కథ ప్రకారం చిరంజీవి సరసన ఇద్దరు కథానాయికలు అవసరం కానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కుమార్తె?