Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాను పెళ్లి చేసుకుని సినిమాతో సంసారం చేస్తున్న యోగి...

సినిమాను పెళ్లి చేసుకుని సినిమాతో సంసారం చేస్తున్న యోగి...
, బుధవారం, 22 మే 2019 (10:12 IST)
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తాజా చిత్రం "మార్కెట్‌లో ప్రజాస్వామ్యం". ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నారాయణమూర్తి గురించి అద్భుతమైన ప్రసంగం చేశారు. 
 
ఆర్. నారాయణ మూర్తి ఒక సినిమా పిచ్చోడన్నారు. ఆయన సినిమాను పెళ్లి చేసుకుని, సినిమాతో సంసారం చేస్తూ, సినిమాలనే తన పిల్లలుగా భావిస్తున్న సినిమా యోగి అని కొనియాడారు. ఆర్ నారాయణ మూర్తితో తనకు నాలుగు దశబాద్దాల అనుబంధం ఉందన్నారు. తామిద్దరం ప్రాణం ఖరీదు చిత్రంలో నటించామని గుర్తుచేశారు. ఆర్. నారాయణ మూర్తి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు తనను ఆహ్వానించడం ఆశ్చర్యానికి లోనయ్యాయని చెప్పారు. ఆయన ఫంక్షన్‌కు రావడం తన కుటుంబ సభ్యుడు కార్యక్రమానికి వచ్చినట్టుగా ఉందని చిరంజీవి ఉందన్నారు. 
 
ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవితో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి పకోడీలు తినిపించారు. ఈ అరుదైన దృశ్యం ఈ చిత్రం ఆడియో లాంచ్‌లో జరిగింది. సాధారణంగా చిరంజీవి ఏ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లినా ఎలాంటి తినుబండారాలు తీసుకోకుండా వెళ్లిపోతారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని అక్కడున్న వారు భావించారు. 
 
కానీ, అందరూ ఆశ్చర్యపోయేలా ప్లేట్‌లో పకోడీలు పెట్టి.. చిరంజీవి చేతికి ఇచ్చి అవి తినేవరకూ ఆర్. నారాయణ మూర్తి అక్కడే ఉన్నారు. ఎవరూ ఊహించని ఈ పనిని మెగాస్టార్‌తో పీపుల్స్ స్టార్ చేయించడంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. ప్రస్తుతం చిరంజీవి పకోడీలు తింటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్కంటే కేతిక శర్మదే.. త్రివిక్రమ్ కంట్లో పడింది..