Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"మ.. మ... మహేశా" అంటున్న మహేశ్

sarkaruvari paata
, శుక్రవారం, 6 మే 2022 (12:38 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పరశురాం దర్శకుడు. ఈ చిత్రం మాస్ మాసాలతో అందరినీ ఉర్రూతలూగించేందుకు వస్తుంది. 'మ.. మ.. మహేశా' అంటూ హీట్ పెంచేందుకు స్పీడ్‌గా దూసుకొచ్చేస్తున్నాడు. ఇందులోభాగంగా, ఈ చిత్రంలోని ఈ పాటను శనివారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం తాజాగా అధికారికంగా వెల్లడించింది. 
 
"సర్కారు వారి పాట మేనియా మరింత పీక్‌కు చేరుకోనుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ మాస్ స్టెప్పులకు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లోనే అత్యంత మాస్ సాంగ్ "మ.. మ.. మహేశ్..." రేపే విడుదల. థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీలు సంయుక్తంగా నిర్మించింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కండోమ్‌లను ప్రమోట్ చేసే నుష్రత్ బరుచా.. ట్రోల్స్ మొదలు