Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనారోగ్యం బారిన ప‌డిన బాల‌కృష్ణ అభిమానికి భ‌రోసా

Balakrishna
, గురువారం, 5 మే 2022 (18:26 IST)
Balakrishna
ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు ఏదైనా  అయితే చచించి పోతారు. ఇలాంటి సంఘ‌ట‌న నిన్న జ‌రిగింది. అభిమానితో వీడియో కాల్ మాట్లాడి ఆయ‌న‌కు ధైర్యం చెప్పారు. ఆదోని మరాఠిగేరిలో ఉండే కాశి విశ్వనాథ్  గత నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం భారిన పడ్డారు. అయన చిన్నప్పటి నుంచి బాలయ్య బాబుకు విరాభిమాని  ఒక్కసారైనా బాలయ్య బాబుతో కలవాలని కోరిక ఉండేది, కానీ ఆ లోపే అయన తీవ్ర అనారోగ్య బారిన పడడంతో, తీవ్ర నిరాశతో బాధపడుతూ ఉండేవారు. ముఖ్యంగా బాలయ్యను కలవలేకపోయాను.. మాట్లాడలేకపోయాను అనే బాధ ఆయనలో ఎక్కువైంది.  వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు N.సజ్జాద్ హుస్సేన్ కు తెలియ‌జేశారు. 
 
వారు బాల‌కృష్ణ‌కు తెలియ‌జేయ‌డంతో  వెంటనే  బాలయ్య స్పందించి వీడియో కాల్ ద్వారా కాశి విశ్వనాథ్ తో మాట్లాడారు. ధైర్యం చెప్పారు.. తాను అండగా ఉంటానని, ఏమైనా అవసరం అయితే అభిమానుల ద్వారా తనకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత వాళ్ళ కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు. ఫోన్ ద్వారా బాలయ్య బాబు తో మాట్లాడించినందుకు ఆయ‌న‌తోపాటు  అభిమాని  కుటుంబ సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆచార్య ఓటీటీ విడుద‌ల మే 29 ?