Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రవితేజకు అండగా నాడు పవన్.. నేడు మహేష్.. ఎందుకు?

రవితేజకు అండగా నాడు పవన్.. నేడు మహేష్.. ఎందుకు?
, బుధవారం, 7 నవంబరు 2018 (09:38 IST)
టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా పేరుగడించిన హీరో రవితేజ, ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో "ట్రిపుల్ ఏ (అమర్, అక్బర్, ఆంటోనీ)" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేలా ప్లాన్ చేశారు. 
 
మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోవా బేబీ ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శ్రీనువైట్ల ‌- ర‌వితేజ కాంబినేష‌న్‌లో వచ్చిన 'నీ కోసం', 'వెంకీ', 'దుబాయ్‌ శీను' వంటి చిత్రాలు వచ్చాయి. ఇవి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అమర్ అక్బర్ ఆంటోని' . ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ వేడుకను ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. 
 
ఈ ఈవెంట్‌కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నాడ‌ని అంటున్నారు. మ‌హేష్‌- శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన "దూకుడు" చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అలానే మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌లో మ‌హేష్ హీరోగా రూపొందిన "శ్రీమంతుడు" భారీ విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్‌కి శ్రీను వైట్ల‌తో, మైత్రి సంస్థ‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మహేష్ రానున్నారు. ర‌వితేజ చివ‌రి చిత్రం "నేల టిక్కెట్టు'కి ప‌వ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా, ఇప్పుడు మ‌హేష్ హాజ‌రుకానుండ‌టం గ‌మ‌న‌ర్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీకి అనుమతించని గుడి ఆలయమే కాదు.. అయ్యప్ప దేవుడే కాదు..