Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనుషులు లాగే రిక్షాను సావిత్రి ఎక్కేది కాదు.. సావిత్రి స్నేహితురాలు సుశీల

''మహానటి'' సినిమాలో సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర వుంటుంది. ఈమె ప్రస్తుతం విజయవాడలో వుంటున్నారు. సుశీల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహానటి గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జెమినీ గణేశన్‌ను వివా

మనుషులు లాగే రిక్షాను సావిత్రి ఎక్కేది కాదు.. సావిత్రి స్నేహితురాలు సుశీల
, శుక్రవారం, 25 మే 2018 (16:09 IST)
''మహానటి'' సినిమాలో సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర వుంటుంది. ఈమె ప్రస్తుతం విజయవాడలో వుంటున్నారు. సుశీల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహానటి గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకోవద్దని చాలామంది చెప్పినా ఆమె వినిపించుకోలేదని.. చిన్ననాటి స్నేహితురాలైన తాను చెప్పినా పట్టించుకోలేదని సుశీల అన్నారు.
 
జెమినీ గణేశన్‌ను సావిత్రి వివాహం చేసుకోనుందనే విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు.. ఇంకా చాలామంది జెమినీని పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. బంధువులు కూడా అదే మాట అన్నారు. సావిత్రి తాను కలిసి విజయవాడలో కలిసి తిరుగుతూ పెరిగామని చెప్పారు. 
 
సావిత్రి స్టార్ హీరోయిన్ అయినా తన బాల్య స్నేహితురాలైన సుశీలను మరిచిపోలేదని.. వీలును బట్టి ఆమెను కలుసుకోవడం.. ఉత్తరాలు రాయడం చేసేవారని సుశీల తెలిపారు. డాన్సు క్లాసుల కోసం తాను సావిత్రి చాలా దూరం నడవాల్సి వచ్చేదని, రిక్షాల్లో వెళ్లమని సావిత్రికి తనకు ఇంట్లో వాళ్లు డబ్బు ఇచ్చేవాళ్లు. కానీ అప్పట్లో అక్కడ మనుషులు లాగే రిక్షాలే ఉండేవు. 
 
ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చారు గదా రిక్షాలో వెళదామా? అని తాను అడిగితే.. అదేవిటే పాపం వాళ్లూ మనుషులే గదా.. వాళ్లు మనల్ని లాగడమేంటి అనేది. తాను కూర్చుని వేరేవాళ్లతో రిక్షా లాగించుకోవడం.. టైమైపోతుందంటే రిక్షావాళ్లు రిక్షా లాగుతూ పరిగెత్తడం సావిత్రికి ఇష్టం వుండేది కాదని.. వాళ్లు పడే కష్టం చూడలేకనే ఆమె ఆ రిక్షాలు ఎక్కకుండా నడిచేదంటూ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి ఫోటోలకు వర్మ తల అంటించాడు.. అంతే పోలీసులు అరెస్ట్ చేశారు..