Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్న రాత్రి గెలిచాను.. ఇప్పుడు ఓడిపోయాను.. అనసూయ

Advertiesment
Lesson
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (10:28 IST)
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో యాంకర్ అనసూయ కూడా పోటీ చేశారు. ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున ఈసీ మెంబర్‌గా బరిలో దిగారు. తొలుత అనసూయ భారీ ఆధిక్యంతో దూసుకుపోతుందని ఆదివారం జోరుగా ప్రచారం జరిగింది.
 
కానీ మరుసటి రోజు ఫలితాలు మారాయి. ‘మా’ ఎన్నికల అధికారి విడుదల చేసిన జాబితాలో అనసూయ పేరు లేదు. మంచు విష్ణు ప్యానెల్ కు చెందినవారు 10 మంది , ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారు 8 మంది ఉన్నారు. దీంతో అనసూయ షాక్ కి గురైంది.
 
నిన్న రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ సెటైరికల్ ట్వీట్‌ చేసింది. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ మరో ట్వీట్ వేసింది. అసలు, 600 పైచిలుకు ఓట్లు లెక్కించడానికి రెండ్రోజుల సమయం అవసరమా? అని సందేహం వ్యక్తం చేశారు అనసూయ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను 2020లో బిడ్డకు జన్మనిచ్చానంటూ చెప్పి షాకిచ్చిన శ్రియ