Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లావణ్య త్రిపాఠి.. చావుకబురు చల్లగా చెప్పింది..?

Advertiesment
Lavanya Tripathi
, శనివారం, 24 అక్టోబరు 2020 (20:20 IST)
Lavanya Tripathi
లావణ్య త్రిపాఠి.. చావుకబురు చల్లగా చెప్పింది..? అదేంటో అనుకునేరు. అదీ ఆమె చేసే సినిమా. ''చావుకబురు చల్లగా' చిత్రంలో కథానాయికగా చేస్తోన్న లావణ్య త్రిపాఠి.. మల్లిక పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 
 
దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్ పోస్టర్​ను విడుదల చేసింది. కథానాయకుడిగా యంగ్​ హీరో కార్తికేయ నటిస్తున్నాడు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే పేర్కొంది.
 
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్​ను నటీమణి లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్ చేసింది. మల్లిక పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని కాప్షన్​ పెట్టింది. ఈ సినిమాకు కౌశిక్​ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
తాజాగా విడుదలైన లావణ్య లుక్‌లో మిడిల్ క్లాస్ అమ్మాయి లుక్‌లో లావణ్య కనిపిస్తోంది. ఆమె లుక్ చూస్తుంటే ఇదేదో లేడి ఓరియెంటెడ్ రోల్‌లో లావణ్య కనిపించబోతుందనే అనుమానం రాక తప్పదు. అయితే కార్తికేయ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. మరి వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా వుంటుందోనని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో రష్మిక మందన 15 రోజులు మకాం... ఎందుకో తెలుసా?