Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగనా రనౌత్‌కు చుక్కెదురు-నిజంగా విదేశాలకు వెళ్ళాల్సి వుంటే..?

Advertiesment
Kanagana Ranaut
, బుధవారం, 16 జూన్ 2021 (17:37 IST)
ముంబై హైకోర్టులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు చుక్కెదురైంది. పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును కంగనా రనౌత్ ఆశ్రయించింది.

పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డేతో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు. ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. 
 
ఈ నెలలో తాను బుడాపెస్ట్‌లో జరుగబోతున్న ‘థక్కడ్’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ తనపై నమోదైన కేసుల కారణంగా పాస్ పోర్ట్ ను అధికారులు రెన్యూల్ చేయలేమని చెప్పారని కంగనా పిటీషన్‌లో పేర్కొంది. 
 
అయితే.. నిజంగా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండి ఉంటే.. పూర్తి వివరాలతో కంగనా పిటీషన్ వేసి ఉండాల్సిందని, ఇప్పుడు ఇచ్చిన సమాచారం అస్పష్టంగా ఉందని కోర్టు విమర్శించింది. కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ, అప్పుడు పూర్తి వివరాలు ఇవ్వమని కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`సోని లివ్`కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి