గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. ఏదైన సినిమా వేడుకకు వెళితే అక్కడ ఆవేశంగా తన దైన శైలిలో మాట్లాడతాడు. అలాంటిదే రెండు రోజులనాడు కిరణ్ అబ్బవరం నటించిన కె రాంప్ సినిమా సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కిరణ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆ క్రమంలో చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని వచ్చాడని అన్నారు. అలాంటి అందరూ తీసుకోవాలంటూ.. ఒక్క సక్సెస్ రాగానే హీరోలంతా ఎలా బిహేవ్ చేస్తారో అనేది చెప్పేశారు.
సక్సెస్ తో వారి స్టయిల్ మారిపోతుంది. ప్రతివాడూ రాజమౌళి, సుకుమార్ కావాలంటూ వారి పేర్లను కోడ్ చేశారు. అయితే ఇది జరిగిన తర్వాత బండ్ల గణేష్ పై ప్రముఖులు ఫైర్ అయినట్లు తెలిసింది. అందుకే ఆయన తన మాటలు వాపసు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.
నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.. అంటూ వివరించారు.
అలాగే గబ్బర్ సింగ్ వంటి సినిమా తీశా. మరో అవకాశం ఇస్తే అలాంటి సినిమా తీస్తానంటూ.. వ్యాఖ్యానించాడు. అలాగే.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం: ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.
మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను అంటూ మరో క్లారిటీ ఇచ్చాడు.