Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

Advertiesment
Rajendra Prasad speech

దేవీ

, సోమవారం, 2 జూన్ 2025 (13:27 IST)
Rajendra Prasad speech
లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూశాక ఇళయరాజాగారు నన్ను చూసి  మొదటిసారిగా ఓరేయ్ అని పిలిచారు నన్ను. అది ప్రేమ. ఆయన నాతో అలా సరదాగా వుంటారు. అది నాకు అలవాటు అయింది. చాలామంది పెద్దలు నన్ను సరదాగా పిలుస్తుంటారు. అలాంటిది ఈమధ్య కొన్ని ఫంక్షన్లలో నేను మాట్లాడిన మాటలు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ ఖర్మ. అది మీ సంస్కారం మీద ఆదారపడి వుంది. నేనే మీ తప్పు మాట్లాడలేదు. నేను చాలా సరదగా వుంటాను. నా స్నేహితులు, కలిసి చేసిన నటులతో నా గురించి వారికి తెలుసు. నేను ఎవరిని పిలిచినా సరదాగా పిలుస్తాను అన్నారు.
 
సోమవారంనాడు షష్టిపూర్తి సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. నేను మీడియాను ఫ్యామిలీ మెంబర్లా చూస్తుంటాను. మీరు నాతో అలానే వున్నారు. నేను సరదాగా మీతో వుంటాను. ఇక అది పక్కన పెడితే.. షష్టిపూర్తి సినిమా నేను చేయడం గర్వకారణం. దేవుడు నాకిచ్చిన వరం. పెళ్లిపుస్తకం చేశాను.  మళ్ళీ దేవుడు పెండ్లిలో చిలిపిసరదాలు కాదురా.. షష్టిపూర్తి కూడా నువ్వు చేయ్. ఆ సాధకబాధలు తెలుస్తాయని  దేవుడు అన్నట్లు ఈ కథ విన్నాక అనిపించింది. దర్శకుడు పవన్ ప్రభ రాసిన కథ చాలా బాగుంది. తన మదర్ చనిపోతే పేరులో ప్రభ రావాలని పవన్ ప్రభగా పెట్టుకున్న మానవత విలువలు, పెద్దల పట్ల గౌరవం వున్న వ్యక్తి పవన్ ప్రభ అన్నారు.
 
ఇక నిన్న హైదరాబాద్ లో ఎస్.వి. క్రిష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఆ ప్రోగ్రామ్ కు మీడియాను పెద్దగా పిలవలేదు. కొన్ని ఛానల్స్ మాత్రమే వచ్చాయి. అదికూడా లైవ్ వుందని తెలీదు. ఆ సందర్భంగా తను అన్నమాటలు ఇలా  వక్రీకరించారని రాజేంద్రప్రసాద్ మేనేజర్ తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?