Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుర్ర హీరోయిన్ కావాలంటున్న రాజమౌళి...

కుర్ర హీరోయిన్ కావాలంటున్న రాజమౌళి...
, సోమవారం, 3 డిశెంబరు 2018 (13:12 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "ట్రిపుల్ ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల ఎంపిక ఇప్పటివరకు జరగలేదు. అయితే, ఈ చిత్రంలో లేడీ ప్రతినాయక పాత్రకు పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్ ప్రియమణిని ఆయన ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి దృష్టి కుర్రకారు హీరోయిన్‌పై పడినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఈషా రెబ్బా పేరును ఆయన పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్‌తో పాటు.. అనూ ఇమ్మాన్యుయేల్, రష్మిక మందన్నా తదితరుల పేర్లను ఆయన పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇపుడు ఈషా రెబ్బా పేరు తెరపైకి రావడం గమనార్హం.
 
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పైగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. అందుకే మంచి హీరోయిన్లను ఎంపిక చేసి వారితో అదిరిపోయే స్టెప్పులేసి థియేటర్‌లో హోరెత్తించాలన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో నటీనటుల పేర్లను కూడా వెల్లడించాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రివ్యూ రైట‌ర్స్ పైన ఫైర్ అయిన హీరో శ్రీకాంత్..!