Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రిష పూజ‌లు ఎందుకు చేసిందో తెలుసా!

త్రిష పూజ‌లు ఎందుకు చేసిందో తెలుసా!
, సోమవారం, 23 ఆగస్టు 2021 (10:12 IST)
Trisha
త్రిష కెరీర్ ఇప్పుడు అంత ఆశాజ‌న‌కంగా లేదు. ఆమ‌ధ్య నిశ్చితార్థంకూడా కేన్సిల్ అయింది. కానీ సినిమాల‌పై ఇంట్రెస్ట్ అలానే వుంది. త‌న మ‌న‌సుకు న‌చ్చిన‌వాడు ఇంత‌వ‌ర‌కు దొర‌క‌లేద‌ని చెబుతోంది. అయితే త‌న‌కు న‌చ్చివాడు ఒక‌డున్నాడు. అంటూ నిన్న‌నే మధ్యప్రదేశ్‌ లోని ఓ గుడిలో త్రిష‌ ప్రత్యేక పూజలు చేసింది. అది సినిమాలో త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తికోసం స‌న్నివేశ‌ప‌రంగా పూజ చేయాల్సివ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది. మణిరత్నం డైరెక్షన్ లో రాబోతున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం అట. ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఓర్చా లొకేషన్స్‌ లో శరవేగంగా జరుగుతోంది.
 
ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్, మరో స్టార్ ‘జయం’రవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్‌ కుమార్, పార్తీబన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్ప‌టికే చాలా భాగం పూర్త‌యింది. కోవిడ్ వ‌ల‌న ఆల‌స్య‌మైంది. కాగా, ఈ  షెడ్యూల్ లో హీరో కార్తీతో పాటు త్రిష, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. వారి పై కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హేష్ అన్న సినిమా ఇదే అవుతుందిః సుధీర్ బాబు