ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి.ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును అని వి వి వినాయక్ టీమ్ కొద్ది సేపటి క్రితం ప్రకటించింది.
వి.వి. వినాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కోలుకుంటున్న ఆయన, తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని ఫిలిం నగర్ లో వార్తలు వచ్చాయి. చిరంజీవి 15౦ సినిమాకు ఆయన దర్శకత్వ్యం వహించారు. ఆతర్వాత గ్యాప్ తీసుకుని బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో ప్రభాస్ చేసిన చత్రపతి సినిమాను హిందీలో రిమేక్ చేసారు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
కరోన తర్వాత ఆయన ఆరోగ్యం పై చాల శ్రద్ద పెట్టారు. నటుడిగా చేయడానికి తన బాడీ ని తగ్గించుకున్నారు. లావుగా ఉండే ఆయన గుర్తు పట్టకుండా మారారు. తను ప్రధాన పాత్రతో సినిమా చేయడానికి సిద్దం అయారు. దిల్ రాజు నిర్మాణంలో రాబోతుందని వార్తలు వచ్చాయి. కాని ఎందుకనో నేను ఆ సినిమా చేయడం లేదని వినాయక్ ప్రకటించారు. ఆ తర్వాత దర్శకుడిగా వేనుకపదిపోయారు. ఆయనతో ఓ సినిమా చేయాలని బెల్లంకొండ సురేష్ కూడా తన పుట్టిన రోజు నాడు ప్రకటించారు. సో, వినాయక్ ఆరోగ్యం గా ఉన్నారని అతని టీం చెపుతోంది.