Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు

దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు
, బుధవారం, 8 మే 2019 (14:45 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వంటి హీరోలకు ల్యాండ్ మార్క్‌ సినిమాలకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందాడు. ఇపుడు మహేష్ బాబు చిత్రానికి కూడా డీఎస్పీ సంగీతం సమకూర్చిన అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
టాలీవుడ్‌లో ఉన్న సంగీత దర్శకుల్లో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. డీఎస్పీ సంగీతం అంటే మ్యూజికల్‌గా హిట్ కొట్టినట్టే. ప్రస్తుతం దేవిశ్రీ మహేష్ బాబు 25వ సినిమాకు సంగీత బాణీలు సమకూర్చాడు. మహర్షిలో సాంగ్స్ పెద్దగా లేవు అనుకున్న వాళ్లకు మహర్షి థీమ్ సాంగ్‌తో సమాధానం చెప్పాడు. "మహర్షి"కి సంగీతం అందిస్తున్న దేవీశ్రీ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. 
 
అదేమంటే.. సౌత్ స్టార్ హీరోల ల్యాండ్ మార్క్‌గా చెప్పుకునే సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో', కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 25వ సినిమా 'సింగం' అలానే మెగాస్టార్ 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ 25వ సినిమా 'మహర్షి'కి కూడా దేవిశ్రీ సంగీతం అందించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిప్పీ ట్రైల‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఫిక్స్.... హిప్పీకి హిట్ వ‌చ్చేనా..?