Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ సరసన దీపికా నటించాల్సిందే.. పట్టుబడుతున్న నాగ్ అశ్విన్?

ప్రభాస్ సరసన దీపికా నటించాల్సిందే.. పట్టుబడుతున్న నాగ్ అశ్విన్?
, మంగళవారం, 14 జులై 2020 (10:42 IST)
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. కరోనా ప్రభావంతో షూటింగ్స్ అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ తన గత చిత్రం ''మహానటి''ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. 
 
ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్‌గా పలువురు హీరోల పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఇంకా ఎవరు ఫైనల్ కాలేదని సమాచారం.
 
అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల కోసం బాలీవుడ్ నటీనటులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట నాగ్ అశ్విన్. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం దేశం మొత్తం గుర్తు పట్టే హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. 
 
ఇప్పటికే దీపికా, ఆలియా భట్‌లను సంప్రదించారు. కానీ దీపికా మాత్రం ఈ సినిమాకు అడిగిన రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గినా నాగ్ మాత్రం ఆమెనే ఫైనల్ చేయాలని డిసైడైనట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. అమితాబ్