Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాత కూతుళ్లకు కరోనా- కుటుంబమంతా క్వారంటైన్‌లో..!

Advertiesment
Chennai Express
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (15:53 IST)
షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాత కరీమ్ మోరానీ రెండో కుమార్తె, నటి జోయా మోరానీకి కరోనా
పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆమె అక్క షాజా మోరానీకి కూడా పాజిటివ్ ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో .. మార్చి మధ్యలో జోయా రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చింది. సోమవారమే వీరికి టెస్టులు జరిగాయి. కానీ రిపోర్టులు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. ఈ పరీక్షలో జోయాకు పాజిటివ్ అని తేలింది. 
 
ఇకపోతే..జోయా మోరానీ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె అక్క ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇక కరీమ్ మోరానీ దంపతులు కూడా టెస్టులు చేయించుకున్నారు. అయితే, వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. 
 
నిర్మాత కుమార్తెలు జోవా మొరాని షాజా మొరాని ఇటీవలే శ్రీలంక నుంచి ముంబైకి వచ్చారు. అనంతరం తాజాగా షాజా మొరానీకి జ్వరం దగ్గుజలుబుతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఇక జోవాను ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్ష చేశారు. అలా ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. 
 
ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన గాయని కనికా కపూర్ వైరస్ బారిన పడ్డారు. చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కనికా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మరో స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తెకు కరోనా సోకడం కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాపై మాధవీ లతా వీడియో వైరల్... కరోనాకు రాజు, పేద తేడా లేదు