Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేతకాని ప్రభుత్వాలను సవాల్ చేస్తున్నాయి: మురళీమోహన్‌ కామెంట్‌

murali moshan
, సోమవారం, 15 మే 2023 (14:35 IST)
murali moshan
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజకీయాల్లో వున్న శ్రద్ధ సినిమారంగంలో లేదు. ఒకవైపు ఆర్‌.ఆర్‌.ఆర్‌. వంటి సినిమాతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పరిశ్రమను మన ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడంలేదు.ఒకప్పుడు నంది అవార్డులు అని కళాకారులకు ప్రోత్సాహాలుగా బహుమతులు ఇచ్చేవారు. కానీ రెండు రాష్ట్రాలు అయ్యాయి. సినిమాను పట్టించుకోవడంలేదు. కానీ ప్రైవేట్‌ సంస్థలు టైమ్స్‌, సంతోషంవంటి కొన్ని సంస్థలు దక్షిణాది కళాకారులకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఒక రకంగా ప్రబుత్వాలకు సవాల్ గా నిలిచాయి. 
 
తాజాగా నంది అవార్డుల పేరుతో తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.గౌడ్‌ నంది అవార్డుల ప్రదానం పేరుతో ఇటీవలే దుబాయ్‌ వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో కొందరు స్క్రూటినీ సభ్యులతో ఎంపికచేసి 24 శాఖలలో ఉత్తములకు అవార్డులు ఇవ్వడం జరుగుతంది. ఈ సందర్భంగా నంది అవార్డుపేరుతో ఇవ్వడం పట్ల సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ పైవిధంగా స్పందించారు. నంది అవార్డు అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అందుకు తగిన విధివిధానాలను చూసుకుని ఇవ్వమని నిర్వాహకులను కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చేతకాకపోతే ఫండ్‌ రైజింగ్‌ చేసుకుని అయినా ఇవ్వాలని సూచించారు. తెలుగు పరిశ్రమ ఎంతో వినోదపు పన్ను ప్రబుత్వాలకు కడుతుంది. అవి ఏమి చేస్తున్నారని నిలదీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కథ వెనుక కథ ఎలా వుందంటే.. రివ్యూ