Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పొత్తులు : నాదెండ్ల మనోహర్

nadendla manohar
, సోమవారం, 15 మే 2023 (11:48 IST)
వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పొత్తులకు ఆసక్తి చూపుతున్నట్టు జనసేన పార్టీ అధినేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ అరాచకత్వం నుంచి ఏపీని విముక్తి చేయడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యమని, అందుకోసం ఏడాదిగా పొత్తుల కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి మేలు జరిగేలా పొత్తులు ఉంటాయని తెలిపారు.

బీజేపీ, టీడీపీతో పొత్తులపై పవన్ చర్చలు జరిపారు. ఈ చర్చలు సీట్లపై కాదు. కేవలం రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ ఆరాచక, అవినీతి పాలనపైనే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జనసేనాని చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర హితం కోసం పవన్ తీసుకునే నిర్ణయానికి పార్టీ శ్రేణులు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

జనసేన పార్టీ అవకాశవాద, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉంటుందన్నారు. మండల, పట్టణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. పవన్ రైతుల సంక్షేమం కోసం స్వంత నిధులు ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి తన జేబులో నుంచి రైతుల కోసం ఒక్క రూపాయి ఖర్చుచేశారా? అని నిలదీశారు.

సీఎం జగన్ హెలికాఫ్టరులో తిరగడం తప్ప చేసిందేముంది? రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి 1.50 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీఎం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పవన్ చేస్తున్న కృషిని అభినందించాల్సింది పోయి కొంతమంది చేత దుష్ప్రచారం చేయించడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,000 కోట్లు ఉంటే కేవలం రూ. వంద కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి నెలా 20 రోజుల సెలవు.. వేతనం రూ.1.3 కోట్లు.. ఎక్కడ?