Publish Date: Thu, 18 Sep 2025 (17:56 IST)
Updated Date: Thu, 18 Sep 2025 (18:00 IST)
వివాదాస్పద రామ్ గోపాల్ వర్మ మళ్ళీ వార్తల్లో నిలిచారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా వర్మపై కొత్త కేసు దాఖలు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వివాదం ఆర్జీవీ నిర్మించిన దహనం అనే వెబ్ సిరీస్ చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ మావోయిస్టు ఇతివృత్తాల నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే తన అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించారని అంజనా సిన్హా ఆరోపించారు.
ఇందులో భాగంగా ఆమె చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మపై చట్టపరమైన చర్య తీసుకుంది. దహనం 14 ఏప్రిల్ 2022న ఓటీటీలో ప్రసారం ప్రారంభమైంది. ఆర్జీవీ మొదటి వెబ్ సిరీస్గా ఇది ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ సిరీస్ను అగస్త్య మంజు దర్శకత్వం వహించారు.