Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.20లక్షలు వద్దనుకున్న వరుణ్.. పార్టీ చేసుకున్న రాహుల్.. పునర్నవి..?

రూ.20లక్షలు వద్దనుకున్న వరుణ్.. పార్టీ చేసుకున్న రాహుల్.. పునర్నవి..?
, సోమవారం, 4 నవంబరు 2019 (10:49 IST)
టాలీవుడ్ తారలతో బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ సందడిగా ముగిసింది. టాప్ ఫైవ్‌లో మొదట అలీ రెజా ఎలిమినేట్‌ కాగా.. ఆ తర్వాత నాగార్జున రూ.10లక్షలు ఆఫర్‌ ఉందని... ఎవరైనా వాటిని తీసుకుని వెళ్లిపోవచ్చని కోరగా ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత మరో రూ.10లక్షలు కలిపి, మొత్తం రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అయినా కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వరుణ్‌ సందేశ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. 
 
దీంతో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో తన ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తనని ఇన్నిరోజుల పాటు ప్రోత్సహిస్తూ వచ్చిన తన అభిమానులు, ప్రేక్షకుల కోసమే తాను రూ.20లక్షలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు.. 20 లక్షలు అలా తీసుకుని ఉంటే తనపై వారు చూపించిన అభిమానానికి విలువ ఉండదని వరుణ్‌ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్‌ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నారు. టైటిల్‌ను గెలిచిన సందర్భంగా రాహుల్, వరుణ్ పార్టీ చేసుకున్నారు. వారిద్దరి ఫోటోలను, వీడియోను పునర్నవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్, వరుణ్‌లు ఒకరిమీద ఒకరు పడుతూ.. బ్రోమాన్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌ను గెలిపించింది శ్రీముఖినేనా?