Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్‌బాస్-3: అబ్బే వద్దు బాబోయ్.. అంటూ పారిపోయిన బండ్ల గణేష్

బిగ్‌బాస్-3: అబ్బే వద్దు బాబోయ్.. అంటూ పారిపోయిన బండ్ల గణేష్
, మంగళవారం, 11 జూన్ 2019 (11:46 IST)
బిగ్‌బాస్-3 కోసం రంగం సిద్ధమవుతోంది. జూన్, జులైలో మూడో సీజ‌న్ మొద‌లు పెట్టాల‌ని యాజమాన్యం భావిస్తోంది. ఈ సీజ‌న్ కోసం ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌ను అనుకున్న నిర్వాహ‌కులు.. చివ‌రికి నాగార్జున‌కు ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తుంది. 
 
ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం వరకూ స్టార్ హీరోలతో భారీ సినిమాలను నిర్మించిన బండ్ల గణేశ్, ఆ తరువాత కొన్ని కారణాల వలన సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.
 
ఇలాంటి తరుణంలో తెలుగు బిగ్ బాస్-3లో నిర్వాహకులు ఆయనను సంప్రదించారట. తమ షోలో పాల్గొనవలసిందంటూ.. ఆ షో గురించి పూర్తి వివరాలు చెప్పారట. అయితే ఫోన్ అందుబాటులో లేకుండా అన్నేసి రోజులు ఉండటం తన వల్ల కాదని నిక్కచ్చిగా చెప్పేసినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోలో పాల్గొన‌బోయే హౌజ్ మేట్స్ గురించే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఓ ఇద్ద‌రు సంచ‌ల‌న తార‌ల పేర్లు మాత్రం ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్నాయి.
 
తెలుగు మీడియాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ వార్త‌లు సావిత్రి ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆమెతో పాటు యాంకర్ శ్రీముఖి కూడా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తుందని తెలుస్తుంది. అందుకే ఆమె పటాస్ నుంచి కూడా తప్పుకుందని తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్కింటి అమ్మాయికి పెళ్లి.. ప్రేమికుడిని అలా అడిగితే?