Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తులు కూడబెట్టకపోయినా అభిమానాన్ని సంపాదించుకొన్నాను : ఎం.ఎం. శ్రీ లేఖ

srilekha, ali, vijayedra prasad and others
, మంగళవారం, 7 మార్చి 2023 (15:14 IST)
srilekha, ali, vijayedra prasad and others
1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన "నాన్నగారు" సినిమాతో సంగీత దర్శకులుగా పరిచయం అయిన ఎం.ఎం. శ్రీ లేఖ 25 సంవత్సరాల జర్నీ చేశారు. సురేష్ ప్రొడక్షన్ లోనే 13 మ్యూజికల్ హిట్ సినిమాలకు  సంగీతం అందించడం విశేషం. రీసెంట్ గా వచ్చిన హిట్ 2 లో  ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన 'ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ సాంగ్ కు సిద్ శ్రీరామ్ అద్బుత‌మైన గొంతుతో పాడి ప్రేక్షకులకు మైమరపింపచేశాడు.ఇలా ఇప్పటివరకు తను 5 భాషల్లో 80 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ అని బుక్ అఫ్ స్టేట్ రికార్డ్ పేర్కొంది.
 
సినిమా రంగంలొకి వచ్చిన తను ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఇండియా, ఖాతర్, యు. ఏ. ఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, నార్వే, యు కె, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ , స్వీడెన్, ఫిన్ ల్యాండ్, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, నైజీరియా, యు యస్ ఏ, botswana, కెనడా, సింగపూర్, మలేసియా, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలగు 25 దేశాల్లో 25 సింగర్స్ తో ఈ నెల 17 నుండి వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రోగ్రాం స్టార్ట్ చేయనున్నారు. అయితే  గత నెలలోనే దర్శకులు  రాజమౌళి గారు ఎం.ఎం. శ్రీ లేఖ వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్  ను  విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.తాజాగా ఈ టీం అంతా నెల 17న బయలు దేరుతున్న సందర్బంగా హైదరాబాద్ లోని  యఫ్.యన్. సి. సి కల్చరల్ సెంటర్ లో గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. 
 
ప్రముఖ దర్శకుడు  విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను శ్రీ లేఖకు ఒక ఆశ చూపించాను.ఆ ఆశ కోసమే తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. ఆ తరువాత తను  కష్టపడి ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను అలరించింది.ఇప్పుడు తన అన్న  కీరవాణి మ్యూజిక్ లో ఆస్కార్ అందుకోబోతుండగా రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో  తన అన్న లాగే శ్రీ లేఖ  కూడా  మంచి మ్యూజిక్ చేసి ఆస్కార్ అంతటి అవార్డు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
సంగీత  దర్శకుడు కోటి మాట్లాడుతూ..ఎం.ఎం. శ్రీ లేఖ మంచి మ్యూజిక్ కంపోజర్, మంచి సింగర్ అందుకే తనంటే నాకు చాలా ఇష్టం.తను చేస్తున్న 25 వరల్డ్ మ్యూజిక్ టూర్ బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఆస్కార్ వరకు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది .ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కు ఆస్కార్ రావాలని దేవుణ్ణి కోరుకున్నాను. తనకు వచ్చింది. ఇప్పుడు కీరవాణి, రాజమౌళి, చంద్ర బోస్ లకు కూడా ఆస్కార్ రావాలని కోరాను. మీ అందరూ ఆశీర్వాదములతో తెలుగు వారికి కూడా ఆస్కార్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
ఎం.ఎం.శ్రీ లేఖ మాట్లాడుతూ,  నన్ను కన్న తల్లి తండ్రులు, మా చిన్నాన్న విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ రామకృష్ణ గార్లే ముఖ్య కారణం. నా 25 సంవత్సరాల ప్రయాణంలో  నన్ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదములు.ఈ రోజు  నేను నా జర్నీలో ఇన్ని పాటలు పాడాను అంటే ఆది నా ఒక్కరి కష్టం కాదు. నాకు తోడుగా ఉన్న నా మ్యూజిషన్స్, సింగర్స్, లిరిక్ రైటర్స్ ది.. వారికీ నా  ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను చిన్న పిల్ల అనుకోకుండా పెద్దలు దాసరి గారు, రామానాయుడు, ముప్పల నేని శివ, చంద్ర మహేష్ ఇలా అందరూ నాకు అవకాశం ఇవ్వడంతో నా ఈ జర్నీ  విజయవంతంగా  కొనసాగుతుంది.అలాగే నా ద్వారా చంద్ర బోస్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం తనిప్పుడు ఆస్కార్ లెవల్లో మంచి గుర్తింపు సాధించడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ అనుకుంటున్నట్లు నా ప్రయాణం హ్యాపీగా సాగలేదు.అందరిలాగే నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను ఇప్పటి వరకు డబ్బుల కోసం, ఆస్తులు కూడ బెట్టడం కోసం పని చేయలేదు. నా ఆత్మ సంతృప్తి కోసమే పని చేశాను. కొన్ని సందర్భాల్లో నా సొంత డబ్బులు పెట్టి అవసరమైన మేరకు ఎక్విప్మెంట్స్ కొన్నాను. ఇప్పటికీ నేను రెంటెడ్ హౌస్ లోనే ఉన్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే నేను ఆస్తులు సంపాదించకపోయినా నా పాటలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్నందుకు  చాలా సంతోషంగా ఉంది  అన్నారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  వచ్చిన తెలంగాణ హనరాబుల్ హై కోర్ట్ జడ్జ్ నంద, ఆలీ,, దర్శకులు ముప్పల నేని శివ, చంద్ర మహేష్, వేణు శ్రీ రంగం. భారతీ బాబు, శైలేష్  కొలను, వై. వి యస్. చౌదరి, గేయ రచయిత  చంద్ర బోస్, లిరిసిస్ట్ భాస్కరపట్ల, లక్ష్మీ భూపాల్ తదితరులు అందరూ పాల్గొని గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలయాళ నటి అనికాపై మాజీ ప్రియుడు దాడి: ఫోటోలు షేర్ చేసిన నటి