Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడం వాస్తవమే : యాంకర్ సుమ

Jayamma- Suma
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (14:30 IST)
ప్రముఖ యాంకర్ సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్‌లో ఎంతో బిజీగా ఉంది యాంకర్ సుమ. ఈ క్రమంలోనే ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొంది. 
 
సాధారణం గానే సుమ కెరీర్ వెండితెరపై హీరోయిన్‌గా మొదలైంది. తరువాత రాజీవ్ కనకాలతో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే కుటుంబ బాధ్యతల కారణంగా ఇక వెండితెరకు దూరం అయింది.
 
కానీ కొన్నాళ్ళకి బుల్లితెరపై యాంకర్‌గా ప్రత్యక్షమై ఇక అలాగే సెట్ అయి పోయింది యాంకర్ సుమ. ఇక ఇప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్లీ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమం లోనే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై రావడానికి కారణం ఏంటి ఎవరిలా మారాలి అనుకుంటున్నారు అని అడుగగా.. అనుష్క సమంత రమ్యకృష్ణ రష్మిక మందన్న లాగా హీరోయిన్‌గా మారాలి అనుకుంటున్నాను అంటూ సరదా సమాధానం చెప్పింది యాంకర్ సుమ. 
 
దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా విశేషాలను ఎన్నో పంచుకుంది. ఆలీతో సరదాగా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారి పోయింది. ఇకపోతే ఇక తాను నటించిన జయమ్మ పంచాయతీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనతో కూడా ఒక పాట పాడేలా చేశాడు అంటూ అభిమానులకు తెలియని సరికొత్త విషయాన్ని చెప్పింది. అంతే కాదు ఆ పాటని పాడి కూడా వినిపించింది.
 
గతంలో సుమ, రాజీవ్ మధ్య గొడవలు అయ్యాయని, వారు విడిపోవాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు వాటిపై సుమ కానీ, రాజీవ్ కానీ స్పందించలేదు. తాజాగా ఈ ప్రోగ్రాంలో ఆలీ దాని గురించి సుమని అడిగాడు.
 
సుమ దీనికి సమాధానమిస్తూ.. "అవును, మా ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడం వాస్తవమే. ఈ 23 ఏళ్లలో చాలా గొడవలు అయ్యాయి. భార్య భర్తలుగా విడాకులు తీసుకోవడం ఈజీనే, కానీ పేరెంట్స్‌గా మాత్రం చాలా కష్టం" అని తెలిపింది. అయితే ప్రోమోలో దీనికి కొంచెమే చూపించినట్లు తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న గొడవల గురించి తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య"కు శుభవార్త (Video)