బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన "అఖండ 2" మూవీ విజువల్గా అద్భుతంగా ఉంటుందని హాస్య నటుడు రచ్చ రవి అన్నారు. సినిమా చూసిన తర్వాత జై బాలయ్య.. హర హర మహాదేవ.. జై బోయపాటి అంటూ ఆడియన్స్ సినిమా థియేటర్స్ నుంచి బయటకు వస్తారన, ఈ సినిమా మన అందరికీ బ్రతికినంత కాలం గుర్తుంటుందన్నారు.
డిఓపి సంతోష్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఇది అద్భుతమైన సినిమా. బాలకృష్ణ గారితో బోయపాటి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని పేర్కొన్నారు.
రేస్ త్రీడీ రాజు మాట్లాడుతూ.. మా డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి నిర్మాతలకు మా హీరో బాలకృష్ణకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 'అఖండ 2' త్రీడీలో హిస్టారికల్గా ఉండబోతుంది. వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరికి థాంక్యూ అన్నారు.
ఎడిటర్ తమ్మి రాజు మాట్లాడుతూ.. 'అఖండ 2' తొలి భాగం కంటే పదింతలు ఎనర్జీతో ఉంటుంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ త్రీడీలో కూడా చూడబోతున్నారు అని తెలిపారు.
అఖండ 2: తాండవం 2డీ, త్రీడీ రెండు ఫార్మాట్లలో డిసెంబరు 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట