Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు 'బిల్లా'లు ఒకేచోట.. కలిసి రెండు గంటల పాటు..

Advertiesment
Ajith
, బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:54 IST)
'బాహుబలి' తర్వాత విడుదల కానున్న ప్రభాస్ మూవీ 'సాహో' షూటింగ్ పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్‌తో జతకడుతున్నారు. భారీ యాక్షన్ మూవీగా యువ దర్శకుడు సుజిత్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. 
 
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినందున ఆ సమయంలోపు పూర్తి చేయడానికి అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సాహో' సెట్స్‌ను సడెన్‌గా విజిట్ చేయడానికి ఒక స్టార్ హీరో వచ్చారు. ఆయన ఎవరో కాదు తమిళ్ 'బిల్లా' అజిత్.
 
తమిళ స్టార్ హీరో అజిత్ 'సాహో' సెట్స్‌కు రాగానే ప్రభాస్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ సెట్స్‌లో రెండు గంటలకు పైగా సరదాగా కాలం గడిపారట. మంచి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న హీరో అజిత్, 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి మధ్య మరో పోలిక ఏమిటంటే, ప్రభాస్ తెలుగులో 'బిల్లా' సినిమా చేస్తే, తమిళంలో 'బిల్లా'గా అజిత్ నటించారు. ఇక్కడి నుండి నేరుగా అజిత్ 'మరక్కార్' చిత్రం షూటింగ్ సెట్స్‌ను కూడా సందర్శించారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రకుల్‌ను వెనుకకు నెట్టి, ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్