Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమి కుంగినా, నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం(Teaser)

adipurush movie still
, ఆదివారం, 2 అక్టోబరు 2022 (20:21 IST)
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్‌ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఓం రౌత్ దర్శకత్వం. 'రామాయ‌ణం' ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా టీజ‌ర్‌ను అయోధ్య వేదిక‌గా ఆదివారం సాయంత్రం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. "భూమి కుంగినా, నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం" అంటూ ప్రభాస్ గంభీరంగా పలికిన డైలాగ్‌తో టీజర్ ఆరంభమవుతుంది. 
 
మొత్తం 1:46 నిమిషాల నిడివి గ‌ల ఈ టీజ‌ర్ ఆడియ‌న్స్‌కు కొత్త అనుభూతి క‌లిగిస్తుంది. అద్భుత‌మైన గ్రాఫిక్స్‌తో ఉన్న ఈ వీడియోను చూస్తుంటే.. సినిమా విజువ‌ల్ వండ‌ర్‌గా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. 
 
ప్రభాస్‌ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఆదిపురుష్‌'. 'సాహో', 'రాధేశ్యామ్‌' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపుల తర్వాత ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 
 
ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోగా.. కొంత‌మంది మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. 
 
కానీ తాజాగా రిలీజ్ చేసిన "ఆదిపురుష్" టీజ‌ర్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించేలా ఉంది. "బాహుబ‌లి" త‌ర్వాత ఆ రేంజ్‌లో ఈ సినిమా ఎంట‌ర్‌టైన్ చేయడం ఖాయ‌మ‌ని ప్రభాస్ ఫిక్స‌వుతున్నారు. 

కృతి సనన్‌ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. టీ సిరీస్‌, రెట్రోఫైల్స్‌ పతాకాలపై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నుంచి వంశీ, ప్రమోద్‌ నిర్మాణంలో భాగమవుతున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐశ్వర్య రాయ్‌ని చూస్తే అసూయగా వుంది : మీనా