Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మీనా.. ఆ ముగ్గురికి ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మీనా.. ఆ ముగ్గురికి ఛాలెంజ్
, సోమవారం, 18 జనవరి 2021 (17:32 IST)
Meena
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్, బిగ్ బాస్ షో 4 ఫేం దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు చెన్నై సైదాపెట్‌లోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ మీనా.
 
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని.
 
ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, ప్రముఖ  కన్నడ హీరో సుదీప్, మళయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్‌లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిత్రపురి క‌మిటీకి ఏం చెప్పారంటే..! ఉపాసనతో మాట్లాడి..?