Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టార్ హీరోలు తేనీటి విందు చేసిన వేళ‌

స్టార్ హీరోలు తేనీటి విందు చేసిన వేళ‌
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (10:58 IST)
Pawan Kalyan, Prabhas, Amitabh
అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ ముగ్గురు క‌లిస్తే ఎలా వుంటుందో ఊహించుకోండి. ఏదైనా ఫంక్ష‌న్‌లో అయితే భ‌లే వుంటుంది. కానీ ముగ్గురు ఒకేసారి త‌మ త‌మ షూటింగ్‌ల‌లో ప‌క్క ప‌క్క‌నే వుండ‌గా జ‌రిగిన విశేషం. గ‌తంలో ఎన్‌.టి.ఆర్‌., ఎ.ఎన్‌.ఆర్‌., ఎం.జి.ఆర్‌.లు అలా క‌లిసిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ లు రామోజీ ఫిలింసిటీలో క‌లిశారు.
 
ప్ర‌భాస్ త‌న తాజా సినిమా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. అదేవిధంగా అమితాబ్ కూడా అదే  ప్రాజెక్ట్ `కె` షూట్‌లో వున్నారు. ఆ ప‌క్క‌నే 
ఫ్లోర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ `భీమ్లానాయ‌క్‌`కు చెందిన పేచ్ వ‌ర్క్ నిన్న‌టితో ముగిసింది. ఈ ముగ్గురు ఉద‌య‌మే షూటింగ్ కు ముందుగానే క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం విశేషం. ఇది అక్క‌డివారికి క‌న్నుల పండ‌వ‌గా అనిపించింది. ఈ ముగ్గురు ఒకేసారి టిఫిన్ తిన‌డం తెలిసిన ఫిలింసిటీ యాజ‌మాన్యానికి చెందిన ప్ర‌ముఖులు వ‌చ్చి వ‌డ్డించ‌డం విశేషం. 
 
అమితాబ్ షూటింగ్ చేస్తున్నారని పవన్ తెలుసుకున్నారు. అమితాబ్ బచ్చన్ ను పవన్ స్వయంగా వెళ్లి కలిశారు. అమితాబ్ కూడా ఉన్న ప్రభాస్ పవన్ ను  రిసీవ్ చేసుకున్నారు. ఈ ముగ్గురూ కలిసి అల్పాహారం కూడా చేశారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించిన సినిమా విశేషాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. త‌న సినిమా ఈనెల 25న విడుద‌ల‌వుతుంద‌ని ప‌వ‌న్, అమితాబ్ తెలియ‌జేశారు. ఆల్ ది బెస్ట్ అంటూ అమితాబ్ అన్నార‌ట‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యతరగతి క‌థ‌ను కొత్త‌గా చూపిన బడవ రాస్కెల్‌