Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌హేష్ బాబు మూవీలో విజ‌య‌శాంతి... ఈ వార్త నిజ‌మేనా..?

మ‌హేష్ బాబు మూవీలో విజ‌య‌శాంతి... ఈ వార్త నిజ‌మేనా..?
, మంగళవారం, 12 మార్చి 2019 (17:33 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు -స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమా ప్ర‌స్తుతం చెన్నైలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మే 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవ‌ల అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. 
 
ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్.. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జూన్ నెలలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకునివెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ మూవీలో లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి న‌టించ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2006లో నాయుడ‌మ్మ సినిమా త‌ర్వాత విజ‌య‌శాంతి సినిమాల్లో న‌టించ‌లేదు. అయితే... ఇటీవ‌ల అనిల్ రావిపూడి విజ‌య‌శాంతికి క‌థ చెప్పార‌ని... ఇందులో ఆమె పాత్ర న‌చ్చి ఓకే చెప్పార‌ని టాక్ వినిపిస్తోంది. 
webdunia
 
గ‌తంలో మ‌హేష్, విజ‌య‌శాంతి క‌లిసి కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో న‌టించారు. ఈ సినిమాలో విజ‌య‌శాంతి, మ‌హేష్ త‌ల్లీకొడుకులుగా న‌టించారు. మ‌రి..అనిల్ రావిపూడితో చేయ‌నున్న సినిమాలో కూడా విజ‌య‌శాంతి త‌ల్లి పాత్ర పోషించ‌నుందా..? లేక వేరే ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేయ‌నున్నారా..? అస‌లు ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తలో వాస్త‌వం ఉందా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిడ్డ పుట్టాక ఏ తల్లయినా కరీనాలా వుంటుందా..? ఎవరు?