Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోలు తీసుకోలేదా..? పారితోషికం పెంచేసిన రష్మిక మందన్న!

Ranbir Kapoor,  Rashmika

సెల్వి

, మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (10:55 IST)
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అందాల తార రష్మిక మందన్న టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప, యానిమల్ వంటి సినిమాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. భారీగా పాపులారిటీ సంపాదించింది. 
 
"పుష్ప" విజయం తర్వాత రష్మిక మందన్న పారితోషికం పెరిగింది. ఇంకా బాలీవుడ్ చిత్రం "యానిమల్" భారీ విజయం తర్వాత మళ్లీ రెమ్యూనరేషన్ పెంచేసింది. రష్మిక మందన్న ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం రూ.4 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది.
 
రష్మిక మందన్న ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డీఎన్ఎస్, పుష్ప 2, ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ రూ.3 నుంచి 3.5 కోట్ల వరకు రష్మిక సంతకాలు చేసినట్లు టాక్ వస్తోంది. ఇప్పుడు అదనంగా రష్మిక కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది.
 
రష్మిక ప్రస్తుతం అదనంగా పారితోషికం డిమాండ్ చేయడం తప్పేమీ కాదని.. హీరోలు తమ సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్ సాధించినప్పుడు వారి వేతనాలు 50 శాతానికి పైగా పెరుగుతాయి. 
 
మరోవైపు కియారా అద్వానీ వంటి బాలీవుడ్ భామలు ఇప్పటికే రూ.4 కోట్లు సంపాదిస్తున్నారు. అలియా భట్ , దీపికా పదుకొణె 8 నుండి 12 కోట్ల వరకు వసూలు చేస్తారు. ఈ అంశాలను పరిశీలిస్తే, రష్మిక ధర రూ. 4 నుండి 4.5 కోట్లు అడగడం తప్పేమీ కాదని సినీ పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూనమ్ పాండే చచ్చిపోయిందంటే చచ్చినా నమ్మలేదంటున్న పూనమ్ భర్త సామ్