Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగా ఫ్యాన్స్‌ని టెన్షన్లో పడేసిన చిరంజీవి..!

మెగా ఫ్యాన్స్‌ని టెన్షన్లో పడేసిన చిరంజీవి..!
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (10:25 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీ తెలుగు రీమేక్‌లో నటించనున్నట్టు తెలియచేసారు. ఈ మూవీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. 
 
అయితే.. ఫస్ట్ టైమ్ చిరంజీవి ఈ సినిమాని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారు అంటే.. సాహో సినిమాతో భారీ బడ్జెట్ మూవీని కూడా బాగా హ్యాండిల్ చేయగలడని నిరూపించుకున్న సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని తెలియచేసారు.
 
 ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు చిరంజీవి ఎనౌన్స్ చేసారు. పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని తెరకెక్కించిన బాబీ ఎన్టీఆర్‌తో జైలవకుశ, వెంకటేష్, నాగచైతన్యలతో వెంకీమామని తెరకెక్కించారు. 
 
ఈ సినిమాలతో యాక్షన్ మూవీస్‌ని మాస్ మూవీస్‌ని బాగా తెరకెక్కించగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ రెండు సినిమాల తర్వాత మెహర్ రమేష్‌తో ఓ సినిమా చేయనున్నట్టు చిరు ప్రకటించారు.
 
 అంతే.. చిరు ప్రకటన చూసి మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే... మెహర్ రమేష్‌ డైరెక్షన్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయ్యింది కానీ.. ఇప్పటివరకు సరైన సక్సెస్ లేదు. 
 
దీంతో ఫామ్ లోని మెహర్ రమేష్‌తో సినిమా చేస్తున్నారని మెగా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిపిస్తోంది. మరి.. చిరు ఇచ్చిన మాటకు కట్టుబడి మెహర్‌తో సినిమా చేస్తారా..? లేక అభిమానులు మెహర్‌తో సినిమా వద్దు అని చెప్పారని సినిమా క్యాన్సిల్ చేస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఒక్క సీన్ నన్ను ఇప్పటికీ బాధిస్తోంది, రాశీ ఖన్నా