Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'తమ్ముడు'కే 'అన్నయ్య' మద్దతు - తేల్చి చెప్పిన మెగాస్టార్

Advertiesment
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవిపై ఇంతకాలం సాగుతూ వచ్చిన ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను పార్టీ మారబోవడం లేదని తేల్చి చెప్పారు. పైగా, తన మద్దతు ఎల్లపుడూ తన సోదరుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనకే ఉంటుదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై సాగుతున్న ప్రచారానికి తెరదించారు. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో విజయవాడ, తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో చిరంజీవి భేటీ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవి వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో ఏకాంత చర్చల అనంతరం సీఎం దంపతులతో కలిసి చిరంజీవి దంపతులు విందు ఆరగించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. 
 
అప్పటి నుంచి చిరంజీవి వైకాపాలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతూ వచ్చింది. దీనిపై చిరంజీవి ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఇదే అంశంపై స్పందించారు. తన మద్దతు ఎప్పటికీ జనసేనకే ఉంటుందని తేల్చి చెప్పారు. తనకు తన సోదరుడు పవన్ కళ్యాణ్, అతని పట్టుదల గురించి బాగా తెలుసని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
అంతేకాకుండా, పవన్ కళ్యాణ్‌కు రాజకీయ సలహాలు అవసరంలేదన్నారు. పైగా, సొంతగా పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు కళ్యాణ్‌కు ఉన్నాయన్నారు. అందువల్ల తన సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా జనసేన పార్టీకే ఉంటుదని చిరంజీవి తేల్చి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టును తాకిన కోవిడ్-19 వైరస్