Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ సినిమా ఆగిందా? అందుకే.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ లైన్లోకి వచ్చాడా?

Advertiesment
Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. అయితే... ఇటీవల ప్రభాస్.. మహానటి సినిమాతో సంచలనం సృష్టించిన నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
ఈ సంచలన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. 
 
అయితే... నాగ్ అశ్విన్‌తో చేయనున్న మూవీని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఇంకా ఆలస్యం అవచ్చు అని వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటే... అభిమానులు షాక్ అయ్యే ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్‌లో హీరో ఎన్టీఆర్ అనుకున్నారు. తాజాగా ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ స్టోరీ రెడీ చేసారట. 
 
నాగ్ అశ్విన్‌తో అనుకున్న ప్రాజెక్ట్ ఆలస్యం అయితే... ప్రశాంత్ నీల్‌తో సినిమాని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. మరి.. నాగ్ అశ్విన్‌తో సినిమా స్టార్ట్ చేస్తారా..? లేక ప్రశాంత్ నీల్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడా...? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NiharikaEngagement, నీహారిక నిశ్చితార్థం