Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమాజంలో లింగభేదం ఉండరాదు : మానుషి

హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనడం ఆనందంగా ఉందని మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ అన్నారు. జీఈఎస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హె

సమాజంలో లింగభేదం ఉండరాదు : మానుషి
, బుధవారం, 29 నవంబరు 2017 (18:36 IST)
హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనడం ఆనందంగా ఉందని మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ అన్నారు. జీఈఎస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఉమెన్ ఎట్ వర్క్ అనే అంశంపై మానుషి తన ఆలోచనలను పంచుకున్నారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కడం పట్ల దేశం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్త్రీ, పురుషులిద్దరినీ సమానంగా చూడాల్సిన అవసరముందని.. ఈ విషయాన్ని పురుషులు తెలుసుకోవాలని మానుషి సూచించారు. 
 
ఇకపోతే, హెల్త్ కేర్ లోపని చేయడం ఇష్టమని… భవిష్యత్‌లో డాక్టర్‌గా సేవలందించడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, మిస్ యూనివర్స్‌గా తన పేరును ప్రకటించిన తర్వాత కాస్తంత ఉద్విగ్నతకు లోనయ్యాయని, అపుడు అలా ప్రవర్తించకుండా మరింత హుందాతనంగా నడుచుకుని వుండాల్సిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కారణాల వల్లే మా ఆయన రాలేకపోయారు: ఉపాసన