Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఎస్ డీఈఈ సెట్ ప్రిలిమినరీ కీ విడుదల

Advertiesment
students
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించిన డీఈఈ సెట్‌ ప్రిలిమినరీ కీ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా జూన్‌ ఒకటో తేదీన ఈ పరీక్ష జరగ్గా 79.40 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష కోసం మొత్తం 6,485 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,144 మంది పరీక్ష రాసినట్టు డీఈఈ సెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసాచారి వెల్లడించారు. 
 
తాజాగా అధికారులు ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. ఈ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జూన్‌ 8వ తేదీ సాయంత్రం 6 గంటల లోగా తెలపాలని విద్యార్థులకు సూచించారు. ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సు చదవాల్సి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మండిపోతున్న ఎండలు.. వేసవి సెలవులు పొడగింపు