Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెరాస ధూంధాం కార్యక్రమం.. దివ్యాంగుడిపై తెరాస నేత దాష్టీకం

Advertiesment
Karimnagar
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో అధికార తెరాస ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు హాజరయ్యాడు. అయితే, ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న గెల్లు శ్రీనివాస్‌తో పాటూ ఎమ్మెల్యే హాజరయ్యారు. 
 
సభ చాలా సీరియస్‌గా జరుగుతుంటే... రాజేష్ అనే దివ్యాంగుడు తనకు పింఛన్ రావడం లేదని నాయకులను కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే అతన్ని పోలీసులు, స్థానిక నాయకులు అడ్డుకున్నారు. సభ ముగిసిన తర్వాత దివ్యాంగుడు.. స్టేజిపైకి ఎక్కి తనకు పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదంటూ మైకులో అడిగాడు. 
 
దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ మహేంద్రాచారి.. ఆగ్రహంతో ఊగిపోయి, స్టేజిపైకి ఎక్కి దివ్యాంగుడు రాజేష్‌ను కిందకు లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారంతా ఆ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ ఇప్పించాల్సింది పోయి.. అడిగినవారిపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాజాలో బాంబుల మోత - ఆయుధ తయారీ కేంద్రాలు ధ్వంసం