Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి శవం పక్కనే మూడు రోజులు శృంగారం.. ఎవరు? ఎక్కడ?

తల్లి శవం పక్కనే మూడు రోజులు శృంగారం.. ఎవరు? ఎక్కడ?
, సోమవారం, 28 అక్టోబరు 2019 (08:06 IST)
ప్రేమ వద్దన్నందుకు కన్న తల్లినే కడతేర్చింది ఓ కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది.

రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి నివాసం ఉంటున్నారు. కూతురు కీర్తి.. ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. కీర్తిని తల్లి రజిత (38) మందలించడంతో ప్రియుడితో కలిసి చంపేసింది. తండ్రి లారీ డ్రైవర్‌గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి మూడు రోజుల పాటు ఇంట్లోనే గడిపింది.

దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. తాను వైజాగ్ టూర్‌కు వెళ్లానని తండ్రికి చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో గడిపింది.

తండ్రి శ్రీనావాస్ రెడ్డి.. కూతుర్ని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను చంపినట్లు కీర్తి అంగీకరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ వక్రబుద్ధి : ప్రధాని మోడీ విమానానికి పర్మిషన్ నిరాకరణ