Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొగుడ్ని పడుకోబెట్టి తొక్కి... భార్య శరీరంపై పళ్లతో కొరికితే పిల్లలు... 'కొరుకుడు' బాబా

మొగుడ్ని పడుకోబెట్టి తొక్కి... భార్య శరీరంపై పళ్లతో కొరికితే పిల్లలు... 'కొరుకుడు' బాబా
, సోమవారం, 25 మార్చి 2019 (12:53 IST)
ఎన్నిసార్లు నకిలీ బాబాల లీలలు గుట్టు రట్టయినా ప్రజల్లో చాలామంది వారినే మళ్లీమళ్లీ నమ్ముతుంటారు. రోడ్డు పక్కన ఎవరైనా చిన్న చిలుకను పెట్టుకుని జోస్యం చెప్తానంటే వెంటనే అక్కడ కూర్చుండిపోతారు కొందరు. అలాగే... ఇంట్లో ఏవైనా ఇబ్బందులు వస్తున్నాయంటే వెంటనే జ్యోతిష్య నిపుణులను కలుస్తారు మరికొంతమంది. ఇవన్నీ కాకుండా మరికొందరు తమపై భౌతికంగా ప్రయోగం చేసేవారిని నమ్ముతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఈమధ్య తెలంగాణలోని యాదాద్రి జిల్లాలోని భువనగిరిలో కొరుకుడు బాబా వెలుగులోకి వచ్చాడు. ఏ రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఎలాంటి శారీరక సమస్యకైనా బాబా నోరు తెరిచి బాగా పళ్లతో గట్టిగా ఒక్కసారి కొరికితే చాలు. శరీరంలో వున్న రోగాలన్నీ మాయం. శరీరంలోని ఏ అంగానికి ఎక్కడ సమస్య వున్నదో చెబితే బాబా లోనికి తీసుకెళ్లి అక్కడ కొరికి పంపిస్తాడు. ఈ వైద్యం కేవలం మహిళలకే మాత్రమే పనిచేస్తుంది. మహిళలు ఎవరైనా సమస్య వున్నదని బాబా వద్దకెళితే పళ్లతో గాట్లు పెట్టి పంపుతాడు.
 
ఇతడు భువనగిరి జిల్లా పుల్లాయగూడెంకు చెందిన రాంరెడ్డి కొరుకుడు బాబాగా అవతారమెత్తాడు. సమస్య నుంచి బయటపడేందుకు బాబాతో కొరికించుకునేందుకు మహిళలు క్యూ కడుతున్నారు. బాబా కొరికినందుకు గాను ఫీజు రూ. రూ.100 నుంచి రూ.200 వరకూ వసూలు చేస్తుంటాడు. ఇది మహిళలకు మాత్రమే. మగవారు సమస్యలంటూ వస్తే వారిని కొరకడు.. పడుకోబెట్టి బాగా తొక్కి పంపిస్తాడు. ఇతడి గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి కాబోయే సీఎంను నేనే.. తొలి సంతకం ఆ ఫైలుపైనే చేస్తా: పవన్