Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు?

kavitha
, సోమవారం, 2 మే 2022 (12:15 IST)
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల టీఆర్ఎస్ నాయ‌కురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 
 
గ్యాస్‌ సిలిండర్, పెట్రోల్‌, డీజిల్ పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు.  కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని సూచించారు. 
 
ప్రధాని మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత. 
 
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని  కవిత ప్రశ్నించారు. 
 
కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై మ‌రింతగా ఆర్థిక భారం పెంచుతుందని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17,291 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌